చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
Sakshi Education
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఎస్వో మణె మ్మ, డీఈవో అశోక్ అన్నారు.
ఒలంపిక్ డే సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బాలిక ఉన్నత పాఠశాల నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఒలంపిక్ రన్ ను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. నిత్యం ఆటలు ఆడటం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి కృష్ణమూర్తి, సీఐ రమేశ్, నారాయణరెడ్డి, వంశీ, మీనారెడ్డి, రాకేశ్, విద్యాసాగర్, శంకర్, భాస్కర్, అరవింద్, రవి పాల్గొన్నారు.
Published date : 23 Jun 2023 03:44PM