సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ పరిధిలో 148 వ్యవసాయాధికారి(AO) పోస్టుల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది.
AO కొలువులకు నోటిఫికేషన్ విడుదల
వీటిలో 100 కొలువులు మల్టీజోన్–1 పరిధిలోనివి కాగా, 48 పోస్టులు మల్టీజోన్–2 పరిధిలోనివి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తు సమర్పణకు జనవరి 30 సాయంత్రం 5గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ కొలువులకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.