Skip to main content

High Court: ‘ఈడబ్ల్యూఎస్‌’ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోండి

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్న పోలీస్‌ ఉద్యోగాల నియామకంలో కనీస కటాఫ్‌ మార్కులు తగ్గించాలన్న ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసు కోవాలని ప్రభుత్వం, పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
High Court
‘ఈడబ్ల్యూఎస్‌’ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోండి

సబ్‌ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో ఓసీ కేటగిరీతో సమానంగా తమకు కూడా కటాఫ్‌ మార్కులు ఒకే విధంగా నిర్ణయించారని.. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రత్యేకంగా పేర్కొనలేదని హైదరాబాద్‌కు చెందిన దొడ్డ శ్రీనాథ్‌రెడ్డి సహా 13 మంది హైకోర్టును ఆశ్రయించారు.

చదవండి: KNRUHS: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ముందుకురాని ఎన్‌సీసీ

అక్టోబర్‌ 10న పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు ఇచ్చిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను కొట్టేయా లని విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రత్యేక కటాప్‌ మార్కు లను నిర్ణయిస్తూ మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈడ బ్ల్యూఎస్‌ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించి 3 వారాల్లో నిర్ణయం తీసుకోవా లని ప్రభుత్వం, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఆదేశాలు జారీచేశారు.

చదవండి: Supreme Court : ఈడబ్ల్యూఎస్‌ కోటా చెల్లుతుందిలా.. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో..

Published date : 10 Nov 2022 01:26PM

Photo Stories