సాక్షి, హైదరాబాద్: ఇప్పటికీ ఇంకా ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పత్రాల్లో 13 తప్పులున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్ చేశారు.
‘పోలీసు పరీక్ష పత్రాల్లో 13 తప్పులు’
ఆయన జనవరి 31న విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ నియామకాల విషయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరినందుకు తమపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేవైఎం పోరాటం వల్లే ప్రభుత్వం దిగొచ్చి ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో 7మార్కులు కలిపిందని చెప్పారు. నియామక బోర్డ్ తప్పిదాల వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.