Skip to main content

TSBIE: నిఘా నేత్రాల నడుమ ఈ పరీక్షలు.. నవీన్‌ మిత్తల్‌ సూచ‌న‌లు ఇవే..

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మార్చి 15 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేట ర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 4,17,740 మంది విద్యా ర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,19,790 మంది ప్రథమ, 1,97,950 మంది ద్వి తీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. సుమారు 548 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారు లను నియమించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోని పరీక్ష కేంద్రాలకు మాత్రం అదనపు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా స్థాయి పరీక్షల కమిటీ(డీ ఈసీ)తో పాటు హైపవర్ కమిటీ సభ్యులు సైతం ఆకస్మికంగా కేంద్రాలను సందర్శించేలా చర్యలు చేపట్టారు. నిఘా నేత్రాల నడుమ పరీక్షల నిర్వ హణ కొనసాగనుంది. పరీక్షలు ఉదయం 9 నుం చి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి.
TS Intermediate 2023 exams
నిఘా నేత్రాల నడుమ ఈ పరీక్షలు.. నవీన్‌ మిత్తల్‌ సూచ‌న‌లు ఇవే..

ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. మార్చి 13న‌ మం త్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఏర్పాట్లపై నిర్వ హించిన వీడియో కాన్పరెన్స్ లో వారు వెల్లడిం చారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, మెడికల్ కిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లను వెబ్ సైట్ www.tsbie.egg.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

అర గంట ముందే చేరుకోండి..

పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు అధికారులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుం డా.. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేసు కునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ప్రత్యేక కంట్రోల్ రూమ్

పరీక్షల నేపథ్యంలో రౌండ్ క్లాక్ పని చేసే విధం గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040- 24801010 లేదా 040- 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. జిల్లాల వారీగా మినీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలీ మానస హెల్ప్ లైన్ నం బర్ 14416ను ఏర్పాటు చేశారు. 

తక్షణమే స్పందిస్తాం: నవీన్‌ మిత్తల్‌ 

మార్చి 14న ఇంటర్ పరీక్షల నిర్వహణపై నవీన్‌ మిత్తల్ మీడియా సమావేశం నిర్వ‌హించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

''ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్‌ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం''అని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అన్నారు. 

మొత్తం పరీక్షా కేంద్రాలు

1,473

ప్రభుత్వ జూనియర్ కాలేజీలు

614

ప్రైవేటు కాలేజీలు

859

పరీక్షలు సిబ్బంది...

 

చీఫ్ సూపరింటెండెంట్లు

1,473

డిపార్ట్మెంట్ల అధికారులు

1,473

ఇన్విజిలేట‌ర్లు

26,333

ప్లైయింగ్ స్క్వాడ్స్

75

సిట్టింగ్ స్క్వాడ్స్

200

హాజరయ్యే విద్యార్థులు మొత్తం

9,47,699

మొదటి సంవత్సరం 

4,82,677

ద్వితీయ సంవత్సరం

4,65,022

 

గ్రూప్

ఫస్టియర్

సెకండియర్

మొత్తం

ఎంపీసీ

2,07,756

1,65,634

3,73,390

ఎంఈసీ

14,675

19,559

34,234

బైపీసీ

 1,00,332

1,11,128

2,11,460

సీఈసీ

98,598

1,11,760

2,10,358

హెచ్ఐసీ

11,295

10,263

21,558

 

Published date : 14 Mar 2023 04:21PM

Photo Stories