Skip to main content

TSBIE: ఈ విద్యార్థుల కోసం సైకాలజిస్టులు

సాక్షి, హైదరాబాద్‌: మార్చి 15 నుంచి జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రత్యేకంగా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను ఏర్పాటు చేశామని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Psychologists
ఈ విద్యార్థుల కోసం సైకాలజిస్టులు

పరీక్షలపై విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడమే దీని ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

అవసరమైన విద్యార్థులు 14416 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రతి జిల్లా ఆస్పత్రుల్లో ఉచిత మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. 

Published date : 04 Mar 2023 03:28PM

Photo Stories