టెన్త్ తర్వాత ఇంటర్ పరీక్షలు రాయని విద్యార్థులు ఈ ఏడాది జూలైలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఆర్ట్స్ గ్రూపులో పరీక్షలు రాసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అవకాశం కల్పిస్తోంది.
నేరుగా ఇంటర్ పరీక్షలకు అవకాశం
దీని కోసం హాజరు మినహాయింపు కింద జూన్ 6వ తేదీలోగా రూ.500 చెల్లించాలనిఇంటర్ బోర్డ్మే 25న ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ ఫస్టియర్ రాయాలనుకునే వారు టెన్త్ తర్వాత ఒక సంవత్సరం, సెకెండియర్కు రెండేళ్ల వ్యవధి ఉండాలని పేర్కొంది. పూర్తి వివరాలకు బోర్డ్ వెబ్సైట్ చూడవచ్చని ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సూచించారు.