Skip to main content

TSBIE: ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును పెంచుతూ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు జారీచేశారు.
Extension of inter admissions deadline
ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

జూలై 31తో అడ్మిషన్ల గడువు ముగిసింది. అయితే వర్షాలు, వరుస సెలవుల నేపథ్యంలో ఆగస్టు 5 వరకు అడ్మిషన్లకు అనుమతించారు. విద్యార్థులు రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 16లోగా కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చని ఇంటర్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ ఆదేశాన్ని పాటించాలని పేర్కొంది.

చదవండి: Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే విద్యార్థులను చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది. గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు బోర్డు తెలిపింది. 

చదవండి: 12,828 Government Jobs After 10th: జీడీఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇలా‌..

Published date : 01 Aug 2023 11:43AM

Photo Stories