Adarsha Vidyalaya School: బస్సుల్లేక విద్యార్థుల అవస్థలు
Sakshi Education
గోదావరిఖనిటౌన్: ఖని బస్టాండ్లో నవంబర్ 17న ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
![students suffer without buses, TransportationIssues, GodavariKhanitown](/sites/default/files/images/2023/11/20/17gdk26-180139mr0-1700459250.jpg)
రామగుండం లింగాపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు రోజూ 2బస్సులు నడుపుతారు. కానీ నవంబర్ 17న ఒక్క బస్సే నడపడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అసహనంతో బస్టాండ్ ఎదుట గల రాజీవ్రహదారిపైకి వచ్చి నిరసనను తెలిపారు.
చదవండి: Inspection in Schools: పాఠాలు విద్యార్థులకు అర్ధమవుతున్నాయో లేదో ప్రతి రోజూ గమనించాలి
విద్యార్థుల ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ, బస్సుల కొరతతో ఒకే బస్సు నడిపంచామన్నారు. ఆలస్యంగానైనా రెండు ట్రిప్పులు నడిపించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించామని తెలిపారు.
Published date : 20 Nov 2023 11:17AM