అక్షరానికి ప్రాణం పోయాలని.. ఉచితంగా బ్యాగులు, నోట్బుక్లు
Sakshi Education
నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్లు అందజేసే కార్యక్రమానికి అహమ్ ప్రాణ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది.
అక్షరానికి ప్రాణం పోయాలని.. ఉచితంగా బ్యాగులు, నోట్బుక్లు
Telangana Women Safety Wing DIG బడుగుల సుమతి ఈ కార్యక్రమాన్ని జూలై 7న లాంఛనంగా హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,000 మంది విద్యార్థులకు బ్యాగు లు, నోట్బుక్స్ అందజేయనున్నారు. పేద పిల్లల చదువుల కోసం కృషి చేస్తున్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ప్రవీణ్ను ఈ సందర్భంగా డీఐజీ అభినందించారు. కార్యక్రమంలో తుల సుభాష్ సొసైటీ చైర్మన్ తుల అరుణ్ కుమార్, సామాజిక కార్యకర్త నాని రెడ్డి పాల్గొన్నారు.