బెల్లంపల్లి: పిల్లలను రోజూ బడికి పంపించాల ని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య సూచించారు. సెప్టెంబర్ 23న బెల్లంపల్లిలోని నంబర్–2 ఇంక్లైన్ పాఠశాలను స్టేట్లెవెల్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా ఆయన సందర్శించారు.
పిల్లలను రోజూ పాఠశాలకు పంపించాలి
తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా పిల్లలను పాఠశాలకు పంపించడం అలవాటు చేయాలని సూచించారు. రోజువారీగా బడికి పంపించకుంటే విద్యార్థులకు పాఠాలు సరిగా అర్థం కావని, ఇంటి దగ్గర చదువుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు క ల్పించాలని, అడపాదడప పాఠశాలకు వెళ్లి పిల్ల ల చదువు గురించి ఉపాధ్యాయులను అడిగి తె లుసుకోవాలని సూచించారు.