Skip to main content

TET Exam: సిద్దిపేట జిల్లాలో టెట్‌ పరీక్షకు 7,168 మంది అభ్యర్థుల హాజరు

TET exam in Siddipet district,Tet Paper-2: 92.57% Attendance,Tet Paper-1: 83.10% Attendance
TET exam in Siddipet district

సిద్దిపేట జిల్లా: శుక్రవారం నిర్వహించిన టెట్‌ ప్రశాంతంగా ముగిసింది. పేపర్‌–1కు 8,625 మంది అభ్యర్థులకు గాను 7,168 మంది హాజరయ్యారు. పేపర్‌–2కు 6,870 మందికి గాను 6,311 మంది పరీక్ష రాశారు. టెట్‌–1 పేపర్‌కు 83.10శాతం, పేపర్‌–2కు 92.57 హాజరుశాతం నమోదు అయ్యింది. ఒక్క నిమిషం నిబంధన అమలు కారణంగా సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో వర్గల్‌ మండలానికి చెందిన అభ్యర్థి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మరో అభ్యర్థి పరీక్ష రాయలేకపోయారు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, పరిశీలకురాలు విజయలక్షి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. 

Published date : 19 Sep 2023 09:19AM

Photo Stories