Quantum Computing: ఏపీ రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్ విలేజ్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం టెక్నాలజీ రంగంలో గొప్ప ముందడుగు వేయబోతోంది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ విలేజ్ను నిర్మించేందుకు సంబంధించి బ్లూప్రింట్ ఇప్పటికే సిద్ధమైంది.
ఈ క్వాంటమ్ విలేజ్ ప్రాజెక్టు డిజైన్ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్&టీ (L&T) అందించనుండగా, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM)తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వృద్ధికి దోహదపడేలా, అవసరమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మద్దతును ఐబీఎం అందించనుంది.
ఈ విలేజ్లో స్టేట్ డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్న మొత్తం డేటాను కేంద్రీకృతంగా భద్రపరిచే, విశ్లేషించే కేంద్రంగా ఉపయోగపడనుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, సమర్థత పెరగడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
Mining Reforms: మైనర్ మినరల్ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం