Skip to main content

Quantum Computing: ఏపీ రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్‌ విలేజ్‌

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Andhra Pradesh government tech project   Quantum technology progress in India  Indias First Quantum Computing Village in Amaravati   Quantum computing village plan in Amaravati

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం టెక్నాలజీ రంగంలో గొప్ప ముందడుగు వేయబోతోంది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ విలేజ్‌ను నిర్మించేందుకు సంబంధించి బ్లూప్రింట్ ఇప్పటికే సిద్ధమైంది.

ఈ క్వాంటమ్ విలేజ్ ప్రాజెక్టు డిజైన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్&టీ (L&T) అందించనుండగా, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM)తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వృద్ధికి దోహదపడేలా, అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మద్దతును ఐబీఎం అందించనుంది.

ఈ విలేజ్‌లో స్టేట్ డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్న మొత్తం డేటాను కేంద్రీకృతంగా భద్రపరిచే, విశ్లేషించే కేంద్రంగా ఉపయోగపడనుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, సమర్థత పెరగడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. 

Mining Reforms: మైనర్‌ మినరల్‌ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం

Published date : 26 Apr 2025 08:47AM

Photo Stories