OU JAC: జేఎల్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని పునఃపరిశీలించండి
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవల జరిగిన ఇంగ్లిష్ జేఎల్ (జూనియర్ లెక్చరర్) ఉద్యోగాల రాత పరీక్ష ప్రశ్న పత్రాన్ని పునఃపరిశీలించాలని ఓయూ జేఏసీ అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయా డిమాండ్ చేశారు.
జేఎల్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని పునఃపరిశీలించండి
సెప్టెంబర్ 13న ఆయన ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంగ్లిష్ జేఎల్ ప్రశ్నపత్రం పారదర్శకంగా లేదన్నారు. టీఎస్పీఎస్సీ ప్రకటించిన సిలబస్కు, పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సంబంధం లేదన్నారు.
సిలబస్లో లేని అంశాల పైన 70 శాతం ప్రశ్నలు ఇచ్చారని వివరించారు. ఈ కారణంగా నిరుద్యోగులు నష్టపోతారని, దీనిపై సీనియర్ ఇంగ్లిష్ అధ్యాపకులచే విచారణ చేపట్టాలని లేదా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.