Junior Civil Judges (JCJ)గా కొత్తగా ఎంపికైన 62 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల పోస్టింగ్లు ఇస్తూ హైకోర్టు ఆగస్టు 3న ఉత్తర్వులిచ్చింది.
జేసీజేలకు పోస్టింగ్లు
అలాగే జేసీజేలుగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న పలువురిని బదిలీ చేసింది. కొత్తగా పోస్టింగ్లు పొందిన ఈ 62 మంది జేసీజేలు ఆగస్టు 17వ తేదీ లోపు బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంధం సునీత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.