Skip to main content

గ్రూప్‌–1 మెయిన్స్‌ ఎంపిక నిష్పత్తిపై పరిశీలన..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న శాసనసభ సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదిస్తామని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.
Observation on Group I Mains Selection Ratio
గ్రూప్‌–1 మెయిన్స్‌ ఎంపిక నిష్పత్తిపై పరిశీలన..

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 11న బిల్లులపై చర్చలో ఆయన మాట్లాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశంపై ఆయన స్పందిస్తూ గ్రూప్‌–1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని వివరించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

నిష్పత్తిలో మార్పులు చేసి 1:100గా ఎంపిక చేయాలన్న సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్‌పీఎస్సీకి సూచిస్తామని తెలిపారు. కొత్త స్టేషన్ల ఏర్పాటు, కొత్త భవనాలపై సభ్యులు సూచనలు చేయగా..చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 

Published date : 13 Feb 2023 03:19PM

Photo Stories