Skip to main content

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు తమ రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్లేందుకు లైన్ క్లియర్‌ అయ్యింది.
Employees
ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్‌..

తెలంగాణ స్థానికత, భార్య లేదా భర్త ఆ రాష్ట్రంలో పనిచేస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలున్నవారిని తెలంగాణకు బదిలీ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ అక్టోబర్‌ 7న ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత నమూనా మేరకు నవంబర్‌ 7లోగా సంబంధిత శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తమ సొంత రాష్ట్రానికి బదిలీ కోరుకుంటున్న విషయాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్.. సీఎం వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. తమ సొంత రాష్ట్రం వెళ్లాలనుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

చదవండి:

అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్

భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం

Published date : 08 Oct 2021 01:25PM

Photo Stories