Skip to main content

Md Farzan Mohammad: జేఎల్‌ ఫలితాల్లో ఫర్జానాకు 23వ ర్యాంక్‌

దుగ్గొండి: జేఎల్‌ పలితాల్లో మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఎండీ.ఫర్జానామహ్మద్‌ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్‌ సాధించారు.
Md Farzan Mohammad

ఫర్జానా హిందీ సబ్జెక్టులో 450 మార్కులకుగాను 313.672 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె దుగ్గొండి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో టీజీటీగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా ఫర్జానా మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివానన్నారు.

చదవండి: IIM 2024 Topper : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్షల్లో అంధురాలి ప్రతిభ

భర్త జమాలుద్దీన్‌ ప్రోత్సాహంతో మరింత పట్టుదల పెరిగిందని, రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈమేరకు ఫర్జానామహ్మద్‌ను ఎన్నా రై శానబోయిన రాజుకుమార్‌, మహ్మదాపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ ఊరటి మహిపాల్‌, మాజీ ఎంపీటీసీ కొల్లూరి విజయ–మోహన్‌రావు, మాజీ సర్పంచ్‌ ఇంగోళి రాజేశ్వర్‌రావు అభినందించారు.

Published date : 10 Jul 2024 10:33AM

Photo Stories