స్థానిక ఎస్పీఎస్ హై స్కూల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పలు ప్రాంతాల క్రీడాకారులు వివిధ జట్ల ద్వారా ఈ ఎంపికలో పాల్గొనగా వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మడకా ప్రసాద్ తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ఎంపికైన జట్లు చిత్తూరు జిల్లా బంగారుపాణ్యం, కాకినాడలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.