Skip to main content

పాఠశాలకు ‘డిజిటల్‌ సామగ్రి’ అందజేత

Providing Digital Equipment to the school
పాఠశాలకు ‘డిజిటల్‌ సామగ్రి’ అందజేత

ఇందల్వాయి: మండలంలోని గౌరారం గ్రామ పూర్వ నివాసి, హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏను గు సురేందర్‌రెడ్డి ఆగ‌స్టు 4న‌ తన పుట్టిన రోజు సందర్భంగా గౌరారం ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రొజెక్టర్‌, మానిటర్‌, కంప్యూటర్‌ తదితర సామగ్రిని అందించారు. జెడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, ధర్పల్లి జెడ్పీటీసీ జగన్‌, సర్పంచ్‌ లక్ష్మి పాల్గొన్నారు.

చదవండి: Sports School Admission 2023-24: క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

విద్యార్థులకు నోట్‌ పుస్తకాల పంపిణీ

సుభాష్‌నగర్‌: నగరంలోని వీహెచ్‌పీ కార్యాలయంలో 50 మంది విద్యార్థులకు వసుధ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్‌పుస్తకాలను ఆగ‌స్టు 4న‌ పంపిణీ చేశారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ ఠాకూర్‌, దాత్రిక రమేష్‌, రెబ్బ ఆనంద్‌, వసుధ ఫౌండేషన్‌ జిల్లా ఇన్‌ఛార్జి పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: National Pest Control Day: శారీరకంగా, మానసికంగా ఎదగాలి: కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

Published date : 05 Aug 2023 03:30PM

Photo Stories