జమ్మికుంట: ఆంగ్లభాష కనీస సామర్థ్యాల సాధనలో ఆశించిన ఫలితాలు పొందడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా సెక్టోరల్ అధికారి కర్ర అశోక్రెడ్డి అన్నారు.
సెక్టోరల్ అధికారి కర్ర అశోక్రెడ్డి
మంగళవారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని సందర్శించారు. అశోక్రెడ్డి, ఎంఈవో విడుపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధించడం జరుగుతోందని తెలిపారు. తొలిమెట్టులో భాగంగా తెలుగు, గణితం, ఆంగ్ల భాషాపై శిక్షణలోని అంశాలను పాఠశాలలో విధిగా ఉపాధ్యాయులు అమలు చేయాలని అన్నారు.