School Benches Donation Programme: ప్రభుత్వ పాఠశాలకు రూ.8.50 లక్షల బెంచ్లు వితరణ
Sakshi Education
పళ్లిపట్టు: పళ్లిపట్టులోని ప్రభుత్వ మహోన్నత బాలుర పాఠశాలకు ప్రైవేటు సంస్థ రూ.8.50 లక్షల విలువైన వంద బెంచ్లు, డెస్క్లు వితరణ చేసింది.
![PTA Committee Request Fulfillment Public Service Scheme Benefits Pallipattu School Distribution benches to government schools 100 Benches and Desks Gifted for Education](/sites/default/files/images/2024/01/27/24cni35-300095mr0-1706325052.jpg)
ఈ పాఠశాలలో 400 మంది విద్యార్ధులు చదువుతున్నారు. తగినన్ని బెంచ్లు, డెస్క్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పాఠశాల పీటీఏ కమిటీ, ప్రధానోపాధ్యాయుడు వినతి మేరకు మోబిస్ ఇండియా ఫౌండేషన్ ప్రజాసేవా పథకం ద్వారా రూ.8.50 లక్షల విలువైన వంద బెంచ్లు, డెస్క్లు అందజేసింది.
చదవండి: 10th Class: ఎస్సెస్సీలో వంద శాతం ఫలితాలే లక్ష్యం.. వెనకబడిన విద్యార్థులకు ఇలా..
పాఠశాల హెచ్ఎం ధనుంజయుడి అధ్యక్షతన జనవరి 24న నిర్వహించిన సమావేశంలో మోబిస్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు నరసింహన్, ప్రసన్నకుమార్ బెంచ్లు, డెస్క్లను పాఠశాల పీటీఏ అధ్యక్షుడు సెంథిల్కుమార్కు అప్పగించారు.
Published date : 27 Jan 2024 08:40AM