Government Teachers: ఉపాధ్యాయుల మధ్య వివాదంపై.. డీఈవో ఆదేశాలు
Sakshi Education
ఒంటిమిట్ట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అనుకోని విధంగా ఉపాధ్యాయుల మధ్య వివాదం ఏర్పడింది. అసలు ఏం జరిగింది..? పూర్తి వివరాలు..
Dispute between government school teachers
సాక్షి ఎడ్యుకేషన్: మండల పరిధి తప్పెటవారిపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎంఈవో వెంకట సుబ్బయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హెచ్ఎం నారాయణరెడ్డిపై ఉపాధ్యాయులు పాలెం మహేష్బాబు, మరో ఉపాధ్యాయుడు కలిసి డీఈవో రాఘవరెడ్డికి పరీక్షల్లో సమాధానం షీట్ కోసం విద్యార్థుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అదే విధంగా హెచ్ఎం కూడా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని డీఈవోకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి, రిపోర్టు ఇవ్వాల్సిందిగా డీఈవో ఆదేశించారని ఎంఈవో తెలిపారు.