సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, నాన్–ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్–2023 మే 17న రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది.
పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే..!
1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా, 98,273 (92.94 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలు ఈ మే 26న 11 AMకు వెల్లడించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ తెలిపారు.