Skip to main content

3 కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలు.. ఈ విభాగాల్లో డిప్లొమా కోర్సుల..

సాక్షి, అమరావతి: యువతకు మంచి భవిష్యత్‌ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
3 New Polytechnic Colleges
3 కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలు.. ఈ విభాగాల్లో డిప్లొమా కోర్సుల..

రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ మార్చి 20న గెజిట్‌ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్‌ కాలే­జీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

చదవండి: పాలిటెక్నిక్‌ విద్యార్థులకు జాబ్‌ మేళా.. జాబ్‌ మేళా తేదీలు ఇవే..

ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్‌ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. 

చదవండి: పాస్‌కాని అభ్యర్థులకు మరో అవకాశం.. షెడ్యూల్‌ ఇదే..

Published date : 21 Mar 2023 05:10PM

Photo Stories