JEE Main 2022: దరఖాస్తు సవరణలకు అవకాశం.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 దరఖాస్తులోని వివరాల సవరణకు ఏప్రిల్ 8వ తేదీవరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) అవకాశం కల్పిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
జేఈఈ దరఖాస్తు సవరణలకు అవకాశం.. చివరి తేదీ ఇదే..
ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన ఈ సవరణ అవకాశం 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇదే తొలి, చివరి అవకాశమని ఎన్ టీఏ పేర్కొంది. విద్యార్థులు అనెగ్జర్–1లోని వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన అదనపు ఫీజును చెల్లించాలి.