Skip to main content

జేఈఈ మెయిన్‌ 2025 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా!

హైదరాబాద్‌, సాక్షి: దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్‌ 2025 (JEE Main 2025) ఉమ్మడి ప్రవేశ పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతంగా రాణించారు. 100 పర్సంటైల్ సాధించిన 24 మంది టాపర్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నలుగురు విద్యార్థులు ఉన్నారు.
jee main 2025 results telangana andhra toppers percentile

తెలంగాణకు చెందిన హర్ష్‌డ్ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్‌తో టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. టాప్‌ 100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోగా, 99 పర్సంటైల్‌కు పైగా సాధించినవారి సంఖ్య 100 మందికి మించింది.

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 12 అర్ధరాత్రి విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 10.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 9.92 లక్షల మంది హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుండి 2 లక్షల మంది పాల్గొన్నారు.

చదవండి: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టుపై టీ–సాట్‌లో ప్రత్యేక పాఠాలు

JEE Advanced 2025: క్వాలిఫై అయినవారి సంఖ్య

JEE మైన్‌ 2025 ర్యాంక్ ఆధారంగా JEE అడ్వాన్స్‌డ్‌కు 2.50 లక్షల మంది ఎంపికయ్యారు. కేటగిరీ వారీగా కటాఫ్ మరియు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది:
 

కేటగిరీ

పర్సంటైల్ కటాఫ్

ఎంపికైన అభ్యర్థులు

ఓపెన్

93.102 పైగా

97,321 మంది

పీడబ్ల్యూబీడీ

0.007 పైగా

3,950 మంది

ఈడబ్ల్యూఎస్

80 పైగా

25,009 మంది

ఓబీసీ

79 పైగా

67,614 మంది

ఎస్సీ

61.15 పైగా

37,519 మంది

ఎస్టీ

47.90 పైగా

18,823 మంది

JEE Advanced 2025 షెడ్యూల్

ఆన్‌లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 23 నుండి

పరీక్ష తేదీ: మే 2, 2025

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Apr 2025 01:20PM

Photo Stories