జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా!

తెలంగాణకు చెందిన హర్ష్డ్ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్తో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. టాప్ 100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోగా, 99 పర్సంటైల్కు పైగా సాధించినవారి సంఖ్య 100 మందికి మించింది.
జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 12 అర్ధరాత్రి విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 10.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 9.92 లక్షల మంది హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుండి 2 లక్షల మంది పాల్గొన్నారు.
చదవండి: మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టుపై టీ–సాట్లో ప్రత్యేక పాఠాలు
JEE Advanced 2025: క్వాలిఫై అయినవారి సంఖ్య
JEE మైన్ 2025 ర్యాంక్ ఆధారంగా JEE అడ్వాన్స్డ్కు 2.50 లక్షల మంది ఎంపికయ్యారు. కేటగిరీ వారీగా కటాఫ్ మరియు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది:
కేటగిరీ |
పర్సంటైల్ కటాఫ్ |
ఎంపికైన అభ్యర్థులు |
ఓపెన్ |
93.102 పైగా |
97,321 మంది |
పీడబ్ల్యూబీడీ |
0.007 పైగా |
3,950 మంది |
ఈడబ్ల్యూఎస్ |
80 పైగా |
25,009 మంది |
ఓబీసీ |
79 పైగా |
67,614 మంది |
ఎస్సీ |
61.15 పైగా |
37,519 మంది |
ఎస్టీ |
47.90 పైగా |
18,823 మంది |
JEE Advanced 2025 షెడ్యూల్
ఆన్లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 23 నుండి
పరీక్ష తేదీ: మే 2, 2025
![]() ![]() |
![]() ![]() |
Tags
- JEE Main 2025 Results
- JEE Main Toppers from Telugu States
- Telangana Andhra Students JEE 100 Percentile
- JEE Main 2025 Telugu Students Success
- JEE Main 2025 Cutoff by Category
- JEE Main Advanced 2025 Eligibility
- JEE Main 2025 Results Telugu Students
- JEE Main 2025 Top 100 Ranks Telugu Students
- JEE Advanced 2025 Cutoff for SC ST OBC EWS
- JEE Main Percentile for JEE Advanced 2025
- How many Telugu students got 99 percentile in JEE Main