Skip to main content

JEE Mains 2025లో బిసి గురుకుల విద్యార్థుల విజయభేరీ!

సాక్షి ఎడ్యుకేషన్: జాతీయ స్థాయిలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన JEE Mains 2025 లో తెలంగాణ‌ బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు విశేష ప్రతిభ చూపించారు. మొత్తం 63 మంది విద్యార్థులు అర్హత సాధించగా, వారిలో 90 పర్సంటైల్ పైగా సాధించినవారు 9 మంది ఉన్నారు.
jee mains 2025 bc gurukula students results

టాప్ స్కోర్లు సాధించిన విద్యార్థులు:

  • ఎం. నవదీప్ – 97.43 పర్సంటైల్
  • వై. రాజశేఖర్ రెడ్డి – 94.10 పర్సంటైల్
  • డి. తరుణ్ – 93.02 పర్సంటైల్
  • ఎం. జాహ్నవి – 92.08 పర్సంటైల్
  • కే. స్వాతి – 91.82 పర్సంటైల్
  • ఆర్. వరుణ్ – 91.68 పర్సంటైల్
  • ఎన్. శ్రీకాంత్ – 91.68 పర్సంటైల్
  • డి. ఆశిష్ – 91.12 పర్సంటైల్
  • సిహెచ్. సాయిప్రసన్న – 90.46 పర్సంటైల్

చదవండి: జేఈఈ మెయిన్‌ 2025 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా!

విద్యార్థుల విజయం లోకనికి:

మొత్తం అర్హత పొందిన విద్యార్థుల్లో 32 మంది అబ్బాయిలు, 31 మంది అమ్మాయిలు ఉన్నారు.

80 పర్సంటైల్ కంటే ఎక్కువ స్కోర్ సాధించినవారిలో 23 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలు ఉన్నారు.

మంత్రి అభినందనలు:

ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంజేపి కార్యదర్శి బడుగు సైదులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Published date : 21 Apr 2025 10:50AM

Photo Stories