Skip to main content

ఇంటర్‌లో పలు రుసుములు రద్దు చేసిన ఏపీ ఇంటర్ బోర్డు

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు చితికిపోయి ఉన్నందున ఇంటర్మీడియెట్‌లో పలు రుసుములు రద్దు చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు సోమవారం ప్రకటించింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బోర్డు చైర్మన్ ఆదిమూలపు సురేష్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసే వివిధ రుసుములు ప్రిన్సిపాళ్లు తీసుకోరాదని స్పష్టం చేశారు.

రద్దయిన రుసుములు ఇలా
(ఫీజు రూ.లలో)...

కేటగిరీ

ఫీజు

రీ అడ్మిషన్

1,000

టీసీ

1,000

సెకండ్ లాంగ్వేజ్ మార్పు

800

మాధ్యమం మార్పు

600

గ్రూపు మార్పు (ఫస్టియర్)

1,000

గ్రూపు మార్పు (సెకండియర్)

1,000

Published date : 15 Dec 2020 02:54PM

Photo Stories