VITEEE-2022 : జూలై 8వ తేదీన వీఐటీఈఈఈ–2022 పరీక్షల ఫలితాలు
Sakshi Education
అమరావతి: వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (వీఐటీఈఈఈ–2022) జూన్ 30వ తేదీన ప్రారంభమైంది.
ఈ పరీక్షలు జూలై 6వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, 12:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు ఈ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 1.86 లక్షల మంది హాజరవుతున్నట్లు విఐటీ–ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సతీష్చంద్ర తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 119 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలను 8వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు విట్ క్యాంపస్లైన వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్లలో ఇంజనీరింగ్ సీట్లు పొందనున్నారు.
Published date : 01 Jul 2022 07:19PM