DEECET 2022: ఫీజు చెల్లింపు గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థలు, ప్రభుత్వేతర ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థల్లో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే డీఈఈసెట్–2022కు ఫీజు చెల్లింపు గడువు జూన్ 19వ తేదీతో ముగియనుందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు.
డీఈఈసెట్–2022 ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఫీజు చెల్లించి జూన్ 20వ తేదీలోపు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షకు 2022 ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా అర్హులేనని వివరించారు. Intermediate Results వెలువడిన తర్వాత ఉత్తీర్ణత ఆధారంగా వారిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.