ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు ట్రిపుల్ ఐటీలో
నవంబర్ 8న ప్రారంభమైంది.
ట్రిపుల్ఐటీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి తొలిరోజున స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ కోటా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను తీసుకుని రాగా, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించారు. స్పోర్ట్స్ కోటా నుంచి 140 మంది అభ్యర్థులను పిలవగా 140 మంది, ఎన్సీసీ కోటాకు సంబంధించి 382 మందికి గాను 308 మంది హాజరయ్యారు.