EAPCET: ఈఏపీ బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 93.40 శాతం హాజరు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీసెట్–2021 బైపీసీ స్ట్రీమ్ పరీక్ష సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది.
ఈఏపీ బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 93.40 శాతం హాజరు
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు 93.40 శాతం మంది హాజరయ్యారు. ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈనెల 6, 7 తేదీల్లోనూ కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు.