సాక్షి ఎడ్యుకేషన్: టీఎస్ ఎడ్సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్సెట్ ఫలితాలను విడుదల చేశారు.
38,091 మంది ఎడ్సెట్కు దరఖాస్తు చేస్తే..
తెలంగాణలో బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్సెట్ పరీక్షను జూలై 25న నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఎడ్సెట్కు 83 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రవాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో మూడు సెషన్లుగా పరీక్ష జరిగింది. అంటే.. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, 12.30 నుంచి 2.30 గంటల వరకు మరో సెషన్, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ జరిగింది. 38,091 మంది ఎడ్సెట్కు దరఖాస్తు చేస్తే, వారిలో 31,578 మంది హాజరయ్యారు.