బీఈడీ కోర్సులో ప్రవేశాలకు జూలై 26న నిర్వహించనున్న TS EDCET–2022కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.
టీఎస్ ఎడ్సెట్–2022 హాల్టికెట్లు సమాచారం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 21 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మూడు విడతలుగా జరిగే ఎడ్సెట్ను మొదటి విడత ఉదయం 9 గంటల నుంచి 11 వరకు, రెండో విడత 12.30 నుంచి 2.30 గంటల వరకు, మూడో విడత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, అర నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టంచేశారు. ఎడ్సెట్–2022కు 39,800 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని రామకృష్ణ వెల్లడించారు.