Skip to main content

Neeraj Chopra: ఏ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నీరజ్‌ చోప్రా నియమితులయ్యాడు?

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు సెప్టెంబర్‌ 8న ప్రకటించింది.
Neeraj Chopra

దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్‌ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్‌ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన క్రీడాకారుడు?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 8
ఎవరు    : జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 
ఎందుకు  : నీరజ్‌ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదని...
 

Published date : 09 Sep 2021 07:02PM

Photo Stories