Skip to main content

Tennis: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టోర్నమెంట్‌?

Rohan Bopanna-Ramkumar Ramanathan

దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌ టాటా ఓపెన్‌ మహారాష్ట్రలో భారత సీనియర్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న, యువతార రామ్‌కుమార్‌ రామనాథన్‌ మెరిశారు. వీరిద్దరు జతగా బరిలోకి దిగి టాటా ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పూణె వేదికగా ఫిబ్రవరి 6న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్‌ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ లూక్‌ సావిల్లె–జాన్‌ ప్యాట్రిక్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయం సాధించి, టైటిల్‌ కైవసం చేసుకున్నారు. బోపన్న–రామ్‌ జంటకు 16,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 12 లక్షల 22 వేలు)లభించింది. 2022 ఏడాది బోపన్న–రామ్‌ జోడీకిది రెండో డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. 2022, జనవరి నెలలో అడిలైడ్‌ ఓపెన్‌లోనూ బోపన్న–రామ్‌ జంట విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్‌లో ఇది 21వ డబుల్స్‌ టైటిల్‌కాగా రామ్‌ ఖాతాలో ఇది రెండో డబుల్స్‌ టైటిల్‌.

చ‌ద‌వండి: అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచ కప్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన జట్టు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌ టాటా ఓపెన్‌ మహారాష్ట్ర డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ గెలిచిన జంట?
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు    : రోహన్‌ బోపన్న, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జంట
ఎక్కడ    : పూణె, మహారాష్ట్ర
ఎందుకు : ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్‌ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ లూక్‌ సావిల్లె–జాన్‌ ప్యాట్రిక్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Feb 2022 01:32PM

Photo Stories