Skip to main content

India vs England: అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచ కప్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన జట్టు?

Under-19 India Team

2022 ఐసీసీ అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. అంటిగ్వా వేదికగా ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టుపై భారత జట్టు విజయం సాధించి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్‌ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 44.5 ఓవర్లలో 189 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కడపటి వార్తలందేసరికి 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత జట్టుకు యశ్‌ ధుల్‌ సారథ్యం వహించగా, ఇంగ్లండ్‌ జట్టుకు టామ్‌ ప్రెస్ట్‌ నేతృత్వం వహించాడు.

కోచ్‌ పదవికి లాంగర్‌ రాజీనామా

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి జస్టిన్‌ లాంగర్‌ రాజీనామా చేశాడు. 2022, జూన్‌తో లాంగర్‌ నాలుగేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో లాంగర్‌కు మరో ఆరు నెలలు మాత్రమే పొడిగింపు ఇస్తామని సీఏ తెలిపింది. దాంతో ఆగ్రహించిన లాంగర్‌ వెంటనే తాను హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. లాంగర్‌ శిక్షణలో ఆస్ట్రేలియా గత ఏడాది తొలిసారి టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గింది.

చ‌ద‌వండి: స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022 ఐసీసీ అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : అంటిగ్వా
ఎందుకు : ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టుపై భారత జట్టు విజయం సాధించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Feb 2022 12:51PM

Photo Stories