Skip to main content

IPL 2023: ఐపీఎల్‌లో ధోనీ రికార్డు.. సీఎస్కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌

ఏప్రిల్ 12న రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మధ్య‌ జ‌రిగిన‌ మ్యాచ్‌తో ధోని మరో మైలురాయి అందుకున్నాడు.
MS Dhoni

ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై జట్టు కెప్టెన్‌ హోదాలో అతను 200వ మ్యాచ్‌ ఆడాడు. అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో 238 మ్యాచ్‌లతో ధోని తొలి స్థానంలో ఉన్నాడు. చెన్నై జట్టుపై రెండేళ్లపాటు నిషేధం విధించిన సమయంలో ధోని రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు తరఫున రెండు సీజన్‌లు (2016, 2017) ఆడాడు. ఓవరాల్‌గా ధోని ఇప్పటి వరకు 214 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ధోనిని చెన్నై ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్‌ సన్మానించారు. కాగా రాజస్తాన్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ మూడు ప‌రుగుల తేడాతో ఓడిపోమ‌యింది.

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..

Published date : 13 Apr 2023 06:12PM

Photo Stories