Skip to main content

Manu Bhaker: 124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్‌.. ఒకే ఒలింపిక్స్‌లో రెండో పతకాలు..

ఒకే ఒలింపిక్స్ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.
Manu Bhaker Bags Second Bronze In Paris Olympics 2024

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌ రెండో పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్‌ జోడీ మనూ భాకర్‌-సరబ్‌జోత్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్‌ మెడల్‌ అందించారు. జూలై 30వ తేదీ దక్షిణ కొరియా జోడీ(వాన్ హోలీ, జిన్ ఎ వాహిమ్‌)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. 

ఒలింపిక్స్‌లో మనూ భాకర్..
10 మీటర్ల ఎయిర్ పిస్టల్: ఈ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుపొంది భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్: సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది.

Manu Bhaker-Sarabjot Singh

124 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి..
మనూ భాకర్ ఒకే ఒలింపిక్స్‌ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళ. ఇది మాత్రమే కాకుండా, ఈ ఘనత సాధించిన తొలి 'ప్యూర్ ఇండియన్' అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్ పేరిట ఉంది. ఈయ‌న 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్‌ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్‌ ఈ రికార్డు బద్దలు కొట్టింది. 

Published date : 30 Jul 2024 03:14PM

Photo Stories