Asian Airgun Championship: ఆసియా ఎయిర్గన్ చాంపియన్ షిప్లో భారత్కు 25 స్వర్ణాలు
Sakshi Education
కొరియాలోని డేగూలో జరుగుతున్న ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్ క్రీడలు నవంబర్ 18న ముగిశాయి. ఈ చాంపియన్ షిప్లో భారత షూటర్లు 25 బంగారు పతకాలు సాధించారు.
![](/sites/default/files/images/2022/11/19/aac-1668849890.jpg)
చివరి రోజు సీనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రిథమ్–విజయ్వీర్ జోడీ 17–3తో రఖిమ్జాన్–ఇరినా (కజకిస్తాన్) జంటపై గెలిచింది. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను బాకర్–సామ్రాట్ జోడీ పసిడి పతకం గెలిచింది.
ఇషా సింగ్ బృందానికి స్వర్ణం
తెలంగాణ షూటర్ ఇషా సింగ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించింది. కొరియాలోని డేగూలో జరుగుతున్న ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్లో ఇషా సింగ్, మను బాకర్, శిఖా నర్వాల్తో కూడిన పసిడి నెగ్గింది. నవంబర్ 17న జరిగిన జూనియర్ మహిళల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా జట్టు 16–12తో కొరియాకు చెందిన కిమ్ మిన్సియో, కిమ్ జుహి, యంగ్ జిన్ జట్టుపై విజయం సాధించింది.
స్వర్ణ పతకాల వేటలో భారత షూటర్లు
Published date : 19 Nov 2022 02:54PM