Skip to main content

FIFA World Cup 2022: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

FIFA 2022

అరబ్‌ దేశం ఖతర్‌ వేదికగా 2022, నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్‌–2022 టోర్నమెంట్‌ ‘డ్రా’ ఏప్రిల్‌ 1న విడుదలైంది. ఆతిథ్య దేశం ఖతర్, ఈక్వెడార్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభంకానుంది. తొలి రోజు నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఇప్పటికి 29 జట్లు అర్హత పొందగా... మిగతా మూడు జట్లు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల ద్వారా ఖరారవుతాయి. ప్లే ఆఫ్స్‌లో పోటీపడనున్న జట్లకూ ‘డ్రా’లో చోటు కల్పించారు. గ్రూప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • గ్రూప్‌ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్‌. 
  • గ్రూప్‌ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్‌ /వేల్స్‌/ఉక్రెయిన్‌. 
  • గ్రూప్‌ ‘సి’: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌. 
  • గ్రూప్‌ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/ పెరూ. గ్రూప్‌ ‘ఇ’: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్‌. 
  • గ్రూప్‌ ‘ఎఫ్‌’: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా. 
  • గ్రూప్‌ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్‌. 
  • గ్రూప్‌ ‘హెచ్‌’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా.

Tennis: ఆసియా–ఓసియానియా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

జీఎస్‌ లక్ష్మి ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో ఏప్రిల్‌ 3న మహిళల వన్డే ప్రపంచకప్‌–2022 ఫైనల్‌కు భారత్‌కు చెందిన గండికోట సర్వ లక్ష్మి(జీఎస్‌ లక్ష్మి) మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మి 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్‌ లీగ్‌–2 మ్యాచ్‌లకు కూడా మ్యాచ్‌ రిఫరీగా సేవలందించింది.

WTT Star Contender: భారతీయ క్రీడాకారిణి మనిక బత్రా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Apr 2022 06:21PM

Photo Stories