Paris Olympics: పారిస్ ఒలింపిక్స్కు ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు!
Sakshi Education
ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంలో ఒకే విశ్వవిద్యాలయానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం అరుదైన ఘనత.
![Eight Chandigarh University Students to Represent India in Paris Olympics 2024](/sites/default/files/images/2024/07/16/chandigarh-university-1721127067.jpg)
ఈ అరుదైన అవకాశం చండీగఢ్ విశ్వవిద్యాలయానికి దక్కింది.
ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు.
Published date : 16 Jul 2024 04:21PM