Skip to main content

Tennis: సాలినాస్‌ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన జంట?

Saketh-Yuki

భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో పదో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్వెడార్‌లోని సాలినాస్ నగరం వేదికగా ఏప్రిల్ 10న ముగిసిన సాలినాస్‌ ఓపెన్‌ టోర్నీ-2022లో సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట పురుషుల డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’ లో రెండో సీడ్‌ అరగాన్‌ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్‌ (ఈక్వెడార్‌) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్‌–యూకీ జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Commonwealth Games : 2026 కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న దేశం?

Tennis Player: ఆటకు వీడ్కోలు పలికిన బెల్జియం క్రీడాకారిణి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సాలినాస్‌ ఓపెన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను గెలిచిన జంట?
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు    : సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట
ఎక్కడ    : సాలినాస్, ఈక్వెడార్
ఎందుకు : ఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’ లో రెండో సీడ్‌ అరగాన్‌ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్‌ (ఈక్వెడార్‌) జోడీపై విజయం సాధించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Apr 2022 05:34PM

Photo Stories