Skip to main content

Kidney Transplant: ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు?

PIG kidney transplant

జంతువుల అవయవాలు మానవులకు అమర్చేందుకు చాలా ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. తాజాగా ఈ ప్రక్రియలో ఉన్న లోపాలను అధిగమించి వారు విజయం సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లంగోన్‌ హెల్త్‌ ఆస్పత్రి వైద్య బృందం పందిలో జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా ఈ విజయం సాధించింది. కిడ్నీ పనిచేయని స్థితిలో ఉన్న ఓ బ్రెయిన్‌ డెడ్‌  మహిళకు ఈ అవయవ మార్పిడి చేశారు.

ఎలా చేశారు..?

యునైటెడ్‌ థెరప్యూటిక్స్‌ కార్ప్‌కు చెందిన రెవివికోక్‌ యూనిట్‌ పరిశోధకులు... తొలుత పంది పిండంలోని జన్యువుల్లో మార్పులు చేశారు. తర్వాత ఆ పిండాన్ని వేరే పంది గర్భంలోకి ప్రవేశపెట్టారు. తద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థతో సరిపోలే వ్యవస్థ కలిగి ఉన్న పంది పిల్ల పుట్టింది. దీనికి గాల్‌సేఫ్‌ అని పేరుపెట్టారు. ఇది పెరిగాక చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తులకు పైన ఉండే థైమస్‌ గ్రంథి (ఇది తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది)ని దాని కిడ్నీకి కలిపారు. కొత్త కిడ్నీ శరీరంలో అమర్చినా కూడా మానవ రోగ నిరోధక శక్తి దాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు.
 

చ‌ద‌వండి: కోణార్క్‌ సాంకేతికత స్పూర్తిగా ఏ ఆలయాన్ని నిర్మించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు?
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు    : అమెరికా వైద్య శాస్త్రవేత్తలు
ఎక్కడ    : ఎన్‌వైయూ లంగోన్‌ హెల్త్‌ ఆస్పత్రి, న్యూయార్క్, అమెరికా

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Oct 2021 05:58PM

Photo Stories