Skip to main content

Pragati OS: ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

Jiophone Next

భారతీయ మొబైల్‌ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియోఫోన్‌ నెక్ట్స్‌ని రూపొందిస్తున్నట్లు రిలయన్స్‌ జియో సంస్థ తెలిపింది. దీనిని 2021 ఏడాది దీపావళి పండుగకు విడుదల చేయనున్నట్లు అక్టోబర్‌ 25న వెల్లడించింది. జియోఫోన్‌ నెక్ట్స్‌ కోసం ఆన్‌డ్రాయిడ్‌ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దిగ్గజ సంస్థ గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి చేసింది. క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌కు పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌ వద్ద ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌నకు చెందిన నియోలింక్‌ ప్లాంట్లలో ఇవి తయారుకానున్నాయి. 10 భాషలను అనువదించే ఫీచర్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
 

చ‌ద‌వండి: వైపా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన దక్షిణాసియా దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్‌ 25
ఎవరు    : రిలయన్స్‌ జియో సంస్థ(దిగ్గజ సంస్థ గూగుల్‌తో కలిసి) 
ఎందుకు : భారతీయ మొబైల్‌ వినియోగదారుల కోసం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Oct 2021 05:45PM

Photo Stories