Skip to main content

All India Radio FM Station: ఆలిండియా రేడియో నూతన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

Venkaiah Naidu - all india radio

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఏప్రిల్‌ 27న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్‌ఎం స్టేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. నాడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హోదాలో నెల్లూరు ఎఫ్‌ఎంకు శంకుస్థాపన చేశామని, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసిన దేవిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ను కూడా వెంకయ్య ప్రారంభించారు.

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నూతన అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు కానుంది?
Saansad Adarsh Gram Yojana: ఆదర్శ గ్రామాల్లో మొదటి పది గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవి?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 27
ఎవరు     : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Apr 2022 05:43PM

Photo Stories