Skip to main content

Telangana: విప్రో లైటింగ్‌ పరిశ్రమను ఏ జిల్లాలో ప్రారంభించారు?

Wipro at HYD

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలోని ఎలక్ట్రానిక్‌ పార్కులో విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ పరిశ్రమ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 5న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఈ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిందని చెప్పారు. కార్యక్రమంలో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ పాల్గొన్నారు.

Y-Hub: వై–హబ్‌ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించనున్న రాష్ట్రం?

జీనోమ్‌ వ్యాలీలో ‘జాంప్‌ ఫార్మా’
సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం కర్కపట్లలోని జీనోమ్‌ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్‌ ఫార్మాను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్‌ ఫార్మా గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ చైర్మన్‌ సుకంద్‌ జునేజా మాట్లాడుతూ.. కెనడా తర్వాత జీనోమ్‌ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్‌ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Andhra Pradesh: పౌర సేవలు పేరుతో ప్రారంభించిన నూతన పోర్టల్‌ ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ పరిశ్రమ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 05
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ    : ఎలక్ట్రానిక్‌ పార్కు, కేసీ తండా, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Apr 2022 12:34PM

Photo Stories