Skip to main content

India: మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏ నగరంలో ఏర్పాటు కానుంది?

Data Center

డేటా సెంటర్ల రంగంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ సమీపం శంషాబాద్‌ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి 2022, ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నిర్మాణంలో అమెజాన్‌ సెంటర్లు

హైదరాబాద్‌లో రూ.20,761 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) 2020, నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమెజాన్‌ డేటా సెంటర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది.

డేటా సెంటర్‌ అంటే..

డేటా సెంటర్లలో సమాచారాన్ని భద్రపరుస్తారు. ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకం. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో వినియోగదారుల సమాచారాన్ని భద్రపరిచేందుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది.

చ‌ద‌వండి: రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
త్వరలో డేటా సెంటర్‌ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 21
ఎవరు    : ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌
ఎక్కడ    : హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌
ఎందుకు : ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Jan 2022 04:15PM

Photo Stories