Skip to main content

Andhra Pradesh: రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?

Fishermens

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో ఏర్పాటు కానుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చు చేస్తారు. ఈ విశ్వవిద్యాలయం  ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది. పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు, పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందుతారని అంచనా. మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సుల బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది.

చ‌ద‌వండి: పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత ఏ జిల్లాలో అమలులోకి తెచ్చారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : జనవరి 20
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : వేములదీవి ప్రాంతం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
ఎందుకు : పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Jan 2022 03:08PM

Photo Stories